Medaram kova bun 2026, మేడారం జాతరలో కోవా బన్ విక్రయిస్తున్న వాలి అనే వ్యాపారి వేధింపులకు గురయ్యాడని ఆరోపణలతో వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కొందరు తమను మీడియా ప్రతినిధులమని చెప్పుకుంటూ వాలి విక్రయిస్తున్న కోవా బన్లు పాడయ్యాయని ఆరోపించారు.

అంతేకాకుండా కోవాలో రవ్వ కలిపారని చెప్పి అతడిని బలవంతంగా బన్ తినిపించినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు సోషల్ మీడియాలో వాలికి మద్దతుగా స్పందించారు.
ఈ ఘటనపై నారా లోకేష్ స్పందిస్తూ వాలిని కలసి సంఘీభావం తెలుపుతానని తెలిపారు.
ఇక ఈ ఘటనపై రాజకీయ వ్యాఖ్యలు కూడా ప్రారంభమయ్యాయి. బీజేపీ కార్పొరేటర్ అకుల శ్రీవాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆహార కల్తీ జరుగుతోందని, పిల్లల ఆరోగ్యంపై దాని ప్రభావం ఉందని అన్నారు. కోవా కిలో రూ.500 ఉంటే రూ.10కు బన్ ఎలా అమ్మగలరని ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే మేడారం జాతరలో జరిగిన ఈ సంఘటన రాజకీయ చర్చలకు దారి తీసింది.
