Medaram Jatara: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క–సరలమ్మ జాతరకి జాతీయ పండుగ హోదా ఇవ్వాలని, అలాగే కేంద్ర నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు వచ్చే మేడారం జాతర కేవలం రాష్ట్ర స్థాయి వేడుక కాదు, ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే ఆధ్యాత్మిక మహోత్సవం కావాలి” అన్నారు.

Medaram Jatara మేడారం జాతర ఏర్పాట్లు,,
రాష్ట్ర ప్రణాళికలు
ఆలయ ప్రాంగణ విస్తరణ
దర్శన సౌకర్యాల మెరుగుదల
భక్తుల కోసం తాత్కాలిక, శాశ్వత వసతుల ఏర్పాటు
రోడ్లు, నీరు, పారిశుద్ధ్య సదుపాయాల బలోపేతం
సీఎం రేవంత్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలను 100 రోజుల లోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో రాయి (స్టోన్) వాడాలని, అది శాశ్వతతను కల్పిస్తుందని చెప్పారు.
కేంద్రంపై విమర్శ
“కుంభమేళాకి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తోంది. కానీ, దేశంలో రెండో అతిపెద్ద మతపరమైన ఉత్సవమైన మెదారం జాతరకి మాత్రం అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వడం లేదు” అంటూ రేవంత్ విమర్శించారు.
జాతర తేదీలు
మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించబడనుంది. అప్పటికి అన్ని వసతులు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
