TELANGANAPATRIKA (June 10) : Mangli Drugs Case Controversy. ప్రముఖ ఫోక్ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన గంజాయి వివాదం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జూన్ 10న చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో జరిగిన ఈ పార్టీపై పోలీసులు దాడి నిర్వహించగా, గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

పుట్టినరోజు వేడుక Turns into Police Raid
మంగళవారం రాత్రి మంగ్లీ సన్నిహితులు, సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో 48 మంది హాజరయ్యారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు అర్థరాత్రి తర్వాత రిసార్టుపై దాడి చేశారు.
Mangli Drugs Case Controversy డ్రగ్ పరీక్షలు & NDPS కేసులు
ఈ దాడిలో 48 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా, 9 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఒక వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడటంతో, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మద్యం, గంజాయి, డీజే లైసెన్స్ లేకుండా నిర్వహణ వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది.
మంగ్లీపై కేసు నమోదు
ఈ ఘటనలో మంగ్లీ, త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణలపై కేసు నమోదు చేశారు. డిజే సౌండ్ అనుమతుల్లేకుండా వినిపించడంపై సౌండ్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో మంగ్లీ వివాదంలో చిక్కుకుపోయారు.
Read More: Read Today’s E-paper News in Telugu