Mahitha Scholarships: సదాశివపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 75 మంది పదవ తరగతి బాలికల విద్యా ప్రయాణానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది మహితా సంస్థ. లాభాపేక్షలేని ఈ సంస్థ, ప్రిన్స్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ మద్దతుతో ఒక్కొక్కరికీ ₹10,000 స్కాలర్షిప్లు అందజేసింది.

Mahitha Scholarships
ఈ కార్యక్రమంలో మహితా ప్రతినిధి కె. బాలచంద్రం విద్యార్థినులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ మరియు ఆర్.డి. మదురి హాజరయ్యారు. విద్యార్థినుల భవిష్యత్తు దిశగా మార్గదర్శకంగా ఉండేందుకు కెరీర్ గైడెన్స్ పుస్తకాలను కూడా పంపిణీ చేశారు.
మహితా సంస్థ ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్త్రీపురుష సమానత్వం, బాలల హక్కుల రక్షణ, పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యా మరియు ఉపాధి అవకాశాల పెంపు కోసం కృషి చేస్తోంది.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “మహితా సంస్థ చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శం. విద్యారంగంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
ఇక విద్యార్థుల భవిష్యత్తు మార్గదర్శనానికి మహితా సంస్థ కొత్త టోల్ ఫ్రీ నంబర్ (1800 233 8899) ను ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులు కెరీర్ కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu
