Mahalakshmi free Bus Scheme: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం మహిళలకు పెద్ద ఊరటగా మారిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ పథకం వల్ల ఇప్పటివరకు మహిళలు సుమారు ₹9,360.06 కోట్ల వరకు ప్రయాణ ఖర్చు ఆదా చేసుకున్నారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.

ఈ పథకాన్ని 2023 డిసెంబర్ 9న ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
Mahalakshmi free Bus Scheme ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుదల
ప్రస్తుతం ఈ పథకం Telangana State Road Transport Corporation బస్సుల్లో 81 శాతం వరకు అమలులో ఉంది.
అధికారుల ప్రకారం, 2026 ఫిబ్రవరి 10 వరకు 273.24 కోట్ల మహిళలు ఈ పథకం ద్వారా ప్రయాణించారు.
ఈ పథకం వల్ల బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 33 శాతం పెరిగింది. దీంతో TGSRTC ఆదాయంపై కూడా సానుకూల ప్రభావం కనిపిస్తున్నట్లు సమాచారం.
Mahalakshmi free Bus Scheme త్వరలో “మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు”
ఇప్పటి వరకు మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలో “మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు” ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ కార్డుల్లో చిప్ అమర్చబడుతుంది. బస్సులో కొత్త ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషీన్ (iTIM) పై కార్డును ట్యాప్ చేస్తే కండక్టర్ సులభంగా జీరో టికెట్ ఇవ్వగలరు.
Mahalakshmi free Bus Scheme ఇతర రాష్ట్రాల వారికి చెక్
కొంతమంది ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొత్త స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు కూడా చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళల ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం ప్రస్తుతం తెలంగాణలో పెద్ద విజయంగా నిలుస్తోంది. ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు మహిళల ప్రయాణ సౌలభ్యం కూడా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది.
Read More: Read Today’s E-paper News in Telugu
