TELANGANA PATRIKA (MAY 10) , KTR Sena Appointment 2025 : శ్రీరామ చిలుక బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన KTR సేన సమావేశంలో భాస్కర్ గౌడ్ను తంగళ్లపల్లి మండల అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన KTR సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ గారు నియామక పత్రాలను అందజేశారు.

మెంగని మనోహర్ విమర్శలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజల పాలన కాదు, ప్రజలను మోసం చేసే పాలన” అని ధ్వజమెత్తారు. “6 గ్యారెంటీల పేరిట 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు,” అని మండిపడ్డారు. KCR నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను కాంగ్రెస్ పాలనలో దిగజార్చారని పేర్కొన్నారు.
KTR Sena Appointment 2025 భాస్కర్ గౌడ్ లక్ష్యాలు
నూతన అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, “సిరిసిల్ల జిల్లాలో గ్రామస్థాయి నుండి యువత, నిరుద్యోగులను చైతన్యపరుస్తూ KTR సేనను బలోపేతం చేస్తాం” అన్నారు. త్వరలోనే ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో తదుపరి నియామకాలు :
- మండల ఉపాధ్యక్షులు: మామిడాల విజయ్, రేగుల రాజు
- ప్రధాన కార్యదర్శి: తౌటి శివకృష్ణ
- మండల ఇంచార్జ్: మామిడాల ఉమాశంకర్
- ప్రచార కార్యదర్శి: గడ్డం అజయ్
- సోషల్ మీడియా అధ్యక్షులు: పిట్ల విన్నూ బాబు
రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ గారు వీరికి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులు
- BRS మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న
- సిరిసిల్ల PACS ఛైర్మన్ బండి దేవాదాసు
- నేరెళ్ల PACS ఛైర్మన్ కోడూరి భాస్కర్
- మాజీ MPP పడిగెల మానసరాజు
- PACS వైస్ చైర్మన్ ఎగుమామిడి రమణారెడ్డి
- మాజీ ZPTC కోడి అంతయ్య
- మోర నిర్మల, అంకారపు రవీందర్, కందుకూరి రామా గౌడ్, బండి జగన్ తదితరులు.

Also Read : Hanuman Yagnam in Siddipet దేశంలో శాంతికోసం హరీశ్ రావు ఆకాంక్ష