Telanganapatrika (July 26): జయశంకర్ విగ్రహం , రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టూ పీజీ పాఠశాల ఆవరణలో ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటు పై నిర్వహించిన స్టాట్యూ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పాల్గొన్నారు.

చిన్నారులకు మార్గదర్శకుడిగా జయశంకర్ విగ్రహం..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆచార్య జయశంకర్ చిత్రపటం ఉందని, అవకాశం ఉన్నచోట విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు గంభీరావుపేట మండలం నమాజ్ చెరువు వద్ద ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ విగ్రహ ఏర్పాటు గురించి చర్చించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెరువు ఎఫ్.టి.ఎల్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేనందున జయశంకర్ విగ్రహం ఏర్పాటు కుదరదని కలెక్టర్ తెలిపారు.
స్టాట్యూ కమిటీ సభ్యులు అంగీకారం మేరకు గంభీరావు పేట మండలంలో ఉన్న కేజీ టూ పీజీ పాఠశాల ఆవరణలో ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు, దీనికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను రోడ్లు భవనాల శాఖ అధికారులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశం లో ఆర్ అండ్ బి ఈ నరసింహ చారి, ఈ.ఈ.పి.ఆర్. సుదర్శన్ రెడ్డి, ఈ ఈ ఇరిగేషన్ కిషోర్ ఎంపీడీవో రాజేందర్ తో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
Read More: Read Today’s E-paper News in Telugu