తెలంగాణ పత్రిక (APR.24) , జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి లో ని పహాల్గ్గమలో హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా గురువారం దుబ్బాక కోర్టు ఆవరణలోబార్ అసోసియేషన్ న్యాయ వాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.మృ**తి చెందిన వారికి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరిపెద్ది సంజీవరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో కొన్ని సంవత్సరాలు పరిపాలించిన ఇంగ్లీష్ దేశాల వారు హిందువులను, ఏమి చేయలేదని, దేశ సంస్కృతిని కాపాడే భారతీయులను ఎవరు ఏం చేయలేరని దాడి చేసిన హిందువులపై ముష్కరుల దాడిని ఖండిస్తూ, కాశ్మీర్ లోని భారతీయులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి లో ని పహాల్గ్గమలో హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి చేసిన ముష్కరులను తీవ్రంగా శిక్షించాల్సిందేనని అధ్యక్షులు మరిపెద్ది సంజీవరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జోగన్న గారి ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిటుకుల అశోక్, ఏజిపీ నాగరాజు రెడ్డి, మహిళ న్యాయ వాది రేణుక, భాస్కర్ రెడ్డి, మహేష్ , బైoడ్ల చంద్రం, కాస్తి శ్రీనివాస్, శ్రీరాం రామకృష్ణ ప్రభు, కూరపాటి సంతోష్, సంతోష్, చరణ్ తేజ, ప్రవీణ్ కుమార్, జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu