Jai Samvidhan Padayatra: చొప్పదండి మండలంలోని సాంబయ్య పల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పుడు రాజ్యంగంపై బిజెపి నాయకులు చేస్తున్న దాడిని ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు. రాబోవు రోజుల్లో బిజెపి పార్టీని గద్దె దించాలని లేకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిజానపురం చందు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పురం రాజేశం, నాయకులు ముద్దసాని రంగన్న, మునిగాల సుధాకర్ గౌడ్, పెరుమాండ్ల గంగయ్య గౌడ్, ముద్దం తిరుపతి, వల్లాల కృష్ణహరి, మునిగాల చందు, తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం రమేష్ గౌడ్, కడారి శంకర్, మావురపు రాములు, కట్టెకోల లక్ష్మణ్, కొత్తపల్లి నవీన్, పెరుక శ్రీనివాస్, లింగంపల్లి మల్లయ్య, చుప్ప శ్రీనివాస్, గన్ను సంతోష్ రెడ్డి, పత్తిపాక నరేష్, మారం శ్రీనివాస్ యాదవ్, జక్కుల అనిల్ కుమార్, గడమల్ల గంగారాం, ఈర్ల స్వామి, కూకట్ల రాజేష్, నల్లాల అఖిల్, లింగంపల్లి మల్లయ్య, కొత్తపల్లి కరుణాకర్, మాచర్ల జగన్, లింగంపల్లి శ్రీనివాస్, సందవేణి తిరుపతి, ఆవుల కనకయ్య, శశి, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.


One Comment on “Jai Samvidhan Padayatra|జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర”