TELANGANAPATRIKA (June 20): Indiramma Indlu 2025. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ 2వ విడత గృహ నిర్మాణ పథకం కింద, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో 2840 లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


సిద్దిపేటలో Indiramma Indlu 2025 ముఖ్యాంశాలు:
- 2840 మందికి ప్రొసీడింగ్స్ పంపిణీ – 2వ విడత
- రూ.5 లక్షలు (దళితులకు రూ.6 లక్షలు) వరకు ప్రభుత్వ మంజూరులు
- జిల్లాలో మొత్తం 12,500 ఇండ్లు మంజూరు
- సిద్దిపేట నియోజకవర్గానికి 3,000 ఇండ్లు
- ఇల్లు నిర్మాణానికి ఉచిత ఇసుక
- రైతులకు ఉచిత కరెంట్ – 1.78 లక్షల గృహాలకు ప్రయోజనం
- రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సహాయం రూ.10 లక్షలు వరకు
- యువతకు ఉపాధి కోసం అడ్వాన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
మంత్రివర్యుల ప్రకటనలు:
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ:
“ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. దళితులకు అదనంగా రూ.1 లక్ష ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాల అభివృద్ధికి తోడ్పడుతున్నాం.”
అలాగే, రైతులకు కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, విదేశీ పెట్టుబడులపై కూడా మాట్లాడారు.
పాల్గొన్న ప్రముఖులు:
జిల్లా కలెక్టర్ కే. హైమవతి ,అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్, మున్సిపల్ ఛైర్పర్సన్ మంజుల రాజనర్సు ,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు ,హౌసింగ్ పీడీ దామోదర్ రావు ,సిద్దిపేట ఆర్డీఓ సాధానందం ,మున్సిపల్ కౌన్సిలర్లు, లబ్ధిదారులు


Read More: Read Today’s E-paper News in Telugu