Hyderabad RTA Seize Private Buses: హైదరాబాద్లో ఆర్టిఏ (రోడ్డు రవాణా అధికారులు) మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం రాత్రి మరియు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా దూరప్రాంతాలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లక్ష్యంగా తీసుకున్నారు.

ఈ తనిఖీల్లో పలు భద్రతా ఉల్లంఘనలు బయటపడి, అనేక బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు మూసివేత, ఫైర్ ఎక్స్టింగ్విషర్ గడువు ముగిసింది
పరిశీలనలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు అడ్డుపడేలా స్లీపర్ బెర్తులు ఏర్పాటు చేసినట్లు, అలాగే బస్సుల్లో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు గడువు ముగిసినవి అని అధికారులు గుర్తించారు. చాలా బస్సుల్లో ఎమర్జెన్సీ హ్యామర్లు లేకపోవడం కూడా ప్రయాణికుల భద్రతకు తీవ్రమైన ప్రమాదమని చెప్పారు.
అనుమతులు లేని బస్సులు, పన్నులు చెల్లించని ఆపరేటర్లు
ఎస్ఎల్ ట్రావెల్స్ అనే సంస్థకు చెందిన బస్సు రోడ్ ట్యాక్స్, పర్మిట్ లేకుండా నడుస్తున్నట్లు బయటపడింది. మరో బస్సులో ప్రయాణికులకు అవసరమైన భద్రతా పరికరాలు కూడా లేవని అధికారులు తెలిపారు.
కూకట్పల్లి మరియు శంషాబాద్ ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగించగా, అనేక బస్సులు, క్యాబ్లు, ఆటోలు, గూడ్స్ వాహనాలపై కేసులు నమోదు చేశారు.
శంషాబాద్లో ఐదు బస్సుల స్వాధీనం
శంషాబాద్ గగన్పహాడ్ ప్రాంతంలో శ్రీవారి, ఆరెంజ్, సలీం, శివ, డెల్టా ట్రావెల్స్ సంస్థలకు చెందిన ఐదు బస్సులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్కువ బస్సులు గడువు ముగిసిన పర్మిట్లతో, భద్రతా పరికరాలు లేకుండా నడుస్తున్నట్లు తేలింది.
కర్నూలు ప్రమాదం తర్వాత హైదరాబాద్ వరకు నడిపిన బస్సు
శనివారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు కర్నూలు వద్ద ట్రక్ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నా, డ్రైవర్ అదే వాహనాన్ని హైదరాబాద్ వరకు నడిపి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆ బస్సును ఆరంఘర్ వద్ద ఆర్టిఏ బృందం ఆపి స్వాధీనం చేసుకుంది.
Hyderabad RTA Seize Private Buses రాబోయే వారాల్లో మరిన్ని తనిఖీలు
ఆర్టిఏ అధికారులు తెలిపారు: “ప్రయాణికుల భద్రత మా ప్రధాన లక్ష్యం. పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఎమర్జెన్సీ పరికరాలు లేని బస్సులపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
రాబోయే వారాల్లో కూడా ఈ రకమైన సేఫ్టీ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగనున్నట్లు తెలిపారు
Read More: Read Today’s E-paper News in Telugu
