హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ బృహత్ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Hyderabad Metro Expansion తో పాటు మూసీ అభివృద్ధి, ట్రాఫిక్ పరిష్కారాలపై కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు వచ్చిన సమస్యలు హైదరాబాద్కు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

మెట్రో విస్తరణ – కీలక నిర్ణయం
L&T నుంచి ప్రభుత్వం స్వాధీనం
మెట్రో రైలు ప్రాజెక్టును L&T నుంచి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు విస్తరించనున్నారు. మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని సీఎం తెలిపారు.
బేగంపేట రన్వే కింద అండర్పాస్
దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్పోర్టు రన్వే కింద అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు సాధించామని సీఎం ప్రకటించారు. రోడ్లను అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా అభివృద్ధి చేస్తున్నారు.

Hyderabad Metro Expansion – తెలంగాణ 3 జోన్లు
CURE, PURE, RARE విభజన
తెలంగాణను CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), PURE (మాన్యుఫ్యాక్చరింగ్ హబ్), RARE (అగ్రికల్చర్) అనే మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తరలించి ఆ భూములను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.
మూసీ ఎలివేటెడ్ కారిడార్
గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడం ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.
2026 ఉగాది తేదీ
