Husband murder for affair: భర్తను ప్రేమికుడితో హత్య చేయించిన భార్య – ఏపీని కలచివేసిన శమ్నాపూర్ ఉదంతం!

Husband murder for affair 2025

Husband murder for affair: భర్త హత్యకు ప్రేమికుడితో సుఫారీ.. శమ్నాపూర్ లో దారుణ ఘటన అనేది ఇప్పుడు ఏపీ రాష్ట్రం అంతా చర్చనీయాంశంగా మారింది. హవేలీ ఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇద్దరు పిల్లల తండ్రిని భార్య తన ప్రేమికుడితో కలిసి హత్య చేయించిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Join WhatsApp Group Join Now

వివాహేతర సంబంధమే కారణం


శమ్నాపూర్‌కు చెందిన మైలీ శ్రీను (28) కు ఏడేళ్ల క్రితం లింగాసాన్ పల్లికి చెందిన లతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మొదట్లో సాఫీగా సాగిన ఈ కుటుంబంలో, లత వరసకు బావ అయిన మైలీ మల్లేశంతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త శ్రీనుకు తెలిసి, పలు మార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టి ఆమెను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

భర్త అడ్డుగా మారాడని హత్యకు ప్లాన్


అయితే లత మల్లేశంతో ఉన్న సంబంధాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. చివరకు భర్తే అడ్డుగా ఉందని భావించి, అతన్ని హత్య చేసి ప్రేమికుడితో స్వేచ్ఛగా జీవించాలనే దురాలోచనకు దిగింది. దీంతో, ఆమె, మల్లేశ్ కలిసి అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్‌తో సుపారీ పద్ధతిలో హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు.

సుపారీకి రూ.50,000 ఒప్పందం


శ్రీనును హత్య చేస్తే రూ.50 వేలు ఇస్తామని మలిశెట్టితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాన్ ప్రకారం, ఏప్రిల్ 16న మద్యం తాగుదామని చెప్పి మైలీ శ్రీనును అంత సాగర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగిన అనంతరం, మద్యం మత్తులో ఉన్న శ్రీనును బాటిల్స్ తో కొట్టి హత్య చేశాడు.

హత్య తరువాత మిస్సింగ్ ఫిర్యాదు


హత్య జరిగాక, ఎవరికీ అనుమానం రాకుండా భార్య లత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భర్త కనిపించకుండా పోయాడంటూ మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బహిర్గతమైంది. హత్య పూర్తిగా Husband murder for affair ప్లాన్ ప్రకారం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ముగ్గురూ అరెస్టులోకి


దర్యాప్తులో భాగంగా లత, మల్లేశ్, మోహన్ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Husband murder for affair కేసుగా నమోదు చేసి మరింత విచారణ చేపట్టారు.

Read More: Telangana revenue minister visit arrangements: కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను సమీక్షించారు

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.