TELANGANA PATRIKA (MAY 10) , Hanuman Yagnam in Siddipet : దేశంలో ఉగ్రవాదం అంతమై శాంతి నెలకొనాలన్న ఆకాంక్షను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వ్యక్తపరిచారు. శనివారం సిద్దిపేటలోని శ్రీ సంతోషిమాత దేవాలయం వద్ద 108 హోమగుండాలతో హనుమాన్ యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ యజ్ఞాన్ని దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించగా, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Hanuman Yagnam in Siddipet భక్తితో యువత మార్గదర్శకులు కావాలి
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, భక్తి భావంతో యువత ముందుకు సాగాలని, హనుమాన్ దీక్ష ద్వారా క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. మండుతున్న ఎండలో చెప్పులు లేకుండా తిరుగుతూ దీక్ష చేస్తున్న యువతను ఆయన అభినందించారు.
ఉగ్రవాదంపై ఆవేదన, సైన్యం పట్ల గౌరవం:
పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన హరీశ్ రావు, ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. భారత సైన్యం పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదంపై పోరాటంలో అద్భుతంగా ముందుకెళ్తోందని కొనియాడారు.
హనుమాన్ దేవాలయం లో పూజలు, అన్నదానం ప్రారంభం:
తర్వాత సిద్దిపేట రంగాధాంపల్లిలోని హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని ప్రారంభించి, స్వయంగా బిక్ష కూడా చేశారు.

Also Read : TGSRTC 2025 నర్సంపేట డిపోకు ప్రగతిచక్రం అవార్డు గౌరవం
One Comment on “Hanuman Yagnam in Siddipet : దేశంలో శాంతికోసం హరీశ్ రావు ఆకాంక్ష”