TELANGANAPATRIKA (June 24):Drug Awareness Campaign in Sircilla. మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గీతే ఆధ్వర్యంలో మంగళవారం నార్కోటిక్ కంట్రోల్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

Drug Awareness Campaign in Sircilla శాఖల సమన్వయంతో మాదకద్రవ్యాల నిర్మూలన సమావేశంలో:
- గంజాయి సాగు నిరోధం
- NDPS కేసుల పరిస్థితి
- యువతలో డ్రగ్స్ వినియోగం నివారణ
- విభాగాల వారీగా అవగాహన కార్యాచరణ
- పైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
విద్యాసంస్థల ద్వారా అవగాహన
కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, వసతి గృహాల్లో వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ బానిసలుగా మారినవారికి కౌన్సిలింగ్, చికిత్స అందించేందుకు డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆరోగ్య మరియు పోలీస్ శాఖల చర్యలు
- మద్యం వ్యసనానికి గురైన వస్త్ర పరిశ్రమ కార్మికులకు అవగాహన
- మెడికల్ షాపుల స్టాక్ తనిఖీ
- అటవీ భూముల్లో గంజాయి సాగుపై నిఘా
- యాంటీ ర్యాగింగ్ కమిటీలు – కళాశాలల్లో ఏర్పాటు
అని కలెక్టర్, ఎస్పీ అధికారులు సూచించారు.
“డ్రగ్స్ కు నో చెప్పండి” – ప్రజలందరికీ పిలుపు
ఈ సమావేశంలో డ్రగ్స్, మాదకద్రవ్యాల ముప్పుపై పోస్ట్ర్లు విడుదల చేశారు. “డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని, ప్రత్యేకంగా యువత జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read More: Read Today’s E-paper News in Telugu