Advertisement

కోడెల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

TELANGANA PATRIKA(JUN 1) , వేములవాడలో కోడెల పంపిణీ, సంరక్షణపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో ఉంచిన 32 జతల కోడె పిల్లలను (మొత్తం 64) అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిప్పాపూర్‌ గ్రామంలో గోశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ, కోడె పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణపై పూర్తి బాధ్యత తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

మెరుగైన దాణా – వైద్య శిబిరాలు

జీవాలకు మంచి దాణా, పచ్చిగడ్డి అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. గోశాల పరిసరాల్లో లోతైన ప్రదేశాలను చదును చేసి, జీవుల నివాసానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నారు. పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాధాభాయి, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహశీల్దార్ విజయ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →