
TELANGANA PATRIKA(MAY31) , తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుడి చిటి ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ 2025 ఫైనల్కు చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ట్రోఫీ గెలవాలని ఆశించిన ఓ అభిమాని “Please god this year RCB won that trophy” అనే ఇంగ్లిష్లో రాసిన చిటిని శుక్రవారం ఆలయ హుండీలో వేశాడు. ఆలయ అధికారులు హుండీ లెక్కింపు సందర్భంగా ఈ చిటిని గుర్తించారు.
వైరల్ అవుతున్న కొండగట్టు అంజన్నకు భక్తుడి చిటి!
ఆర్సీబీ అభిమానుల భక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంజన్నకు చేసిన ఈ ప్రార్థనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆర్సీబీ అభిమానులు తమ జట్టు తొలిసారిగా ట్రోఫీ గెలవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవాలయం, క్రికెట్, మరియు ప్రజల విశ్వాసం కలిసిన ఈ సంఘటన నిజంగా ప్రత్యేకమైనదిగా నిలిచింది.
Read More: Read Today’s E-paper News in Telugu