TELANGANAPATRIKA (JUNE 11): Collector Sandeep Kumar. జిల్లాలో సాగు మరియు తాగునీటి సరఫరా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బుధవారం రోజున కేంద్ర అధికార బృందం తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (PMKSY), జల్ జీవన్ మిషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పురోగతి పై అధికారులతో చర్చలు జరిపారు.

Collector Sandeep Kumar పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుల వివరాలు
కేంద్ర జాయింట్ సెక్రటరీ సెంథిల్ రాజన్, టెక్నికల్ టీమ్ తో కలిసి రెండు రోజుల పాటు జిల్లా పర్యటన చేపట్టి, ప్రాజెక్టుల స్థితిగతులపై వివరాలను ప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్కు తెలియజేశారు.
పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అవసరం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ:
“పాత ప్రాజెక్టుల చివరి ఆయకట్టు పనులు పూర్తి చేసేందుకు కేంద్రం సహకారం అవసరం. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా సిరిసిల్లలో 85% ఆయకట్టు సృష్టించాం. అయితే, ఇంకా 280 కి.మీ. డిస్ట్రిబ్యూషన్ కాల్వలు పూర్తయ్యాయి కానీ మిగిలిన 53 కి.మీ. పనులు పెండింగ్లో ఉన్నాయి,” అని వివరించారు.
రెండవ పంటకు సాగునీరు, రైతులకు లబ్ధి
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-9 కింద మిడ్ మానేరు నుంచి మలక్ పేట్ రిజర్వాయర్కి నీటిని అందించి, ఎల్లారెడిపేట మండలంలో రెండవ పంటకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వమే మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నందున, రైతులకు అధిక లాభాలు లభిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
Collector Sandeep Kumar వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు సరఫరా పద్ధతుల తనిఖీ
అనంతరం కలెక్టర్, కేంద్ర బృందం తో కలిసి మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, కొండాపూర్, మోర్రాయిపల్లి గ్రామాల్లో నీటి సరఫరా పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రిడ్ ఆధారిత నీటి సరఫరా విధానం, నీటి రిజిస్టర్ల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులు వివరించారు.
సమావేశంలో పాల్గొన్న వారు
- జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి
- నీటి పారుదల శాఖ ఇంజనీర్లు
- మిషన్ భగీరథ అధికారులు
- సంబంధిత శాఖల అధికారులు
Read More: Read Today’s E-paper News in Telugu