సిరిసిల్ల: ప్రోటోకాల్ విరుద్ధంగా కలెక్టర్ చర్యలు – సర్పంచ్ ఫోరం ఆగ్రహం

TELANGANA PATRIKA (MAY24) , ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పట్టాల పంపిణీ కార్యక్రమాలలో సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ను ఆహ్వానించకపోవడం అవమానకరమని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మాట్ల మధు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ లు విమర్శించారు.

సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ …

శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఫోరం అధ్యక్షులు మధు కేటీఆర్ సేన అధ్యక్షులు మనోహర్ లు యూత్ జిల్లా నాయకులు శీలం స్వామి, టిఆర్ఎస్ యూత్ నాయకులు చిలువేరి చిరంజీవి, వేముల నరేష్, మెరుగు తిరుపతి, కిరణ్, బండి జగన్, గుండు ప్రేమ్ కుమార్, భాస్కర్ గౌడ్, ఎండి జహంగీర్, రత్నాకర్, అమర్ రావు, రాజేశ్వరరావు, శేఖర్, చారి, భరత్ లతో కలిసి మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఇండ్ల మంజూరి పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆహ్వానించలేదని పేర్కొన్నారు. కేటీఆర్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డిని ప్రభుత్వపరంగా ఎలాంటి అధికారాలు లేకున్నా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా, అధికారికంగా పాల్గొని ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మధ్య వివాదాలు తలెత్తి గొడవలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వివాదాలకు ముఖ్య కారకుడు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, రాజన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆజ్యం పోస్తున్నారని అన్నారు. ఈ విషయాలపై పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇకనుంచైనా ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం చేయాలని కోరారు. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా అశాంతికి గురి చేస్తూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read : సిరిసిల్ల: నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కలెక్టర్

One Comment on “సిరిసిల్ల: ప్రోటోకాల్ విరుద్ధంగా కలెక్టర్ చర్యలు – సర్పంచ్ ఫోరం ఆగ్రహం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *