Telanganapatrika (July 10): కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, ముస్తాబాద్ మండలంలో ఎరువులు, విత్తనాల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలనే లక్ష్యంతో శ్రీనివాస్ ఎరువులు, కోరమండల్ మన గ్రోమోర్ వంటి ప్రముఖ దుకాణాలు మరియు ఆవునూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని పరిశీలించారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..
ముస్తాబాద్ మండలంలోని శ్రీనివాస్ ఎరువులు,విత్తనాలు, కోరమండల్ మన గ్రోమోర్, విక్రయ దుకాణాలను , గోదాములను,ఆవునూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎరువులు,విత్తనాల దుకాణాల్లో ఎరువులు, విత్తనాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.శ్రీనివాస్ ఎరువులు మరియు విత్తనాలు, కోరమండల్ మన గ్రోమోర్ విక్రయ దుకాణాలలో,ఆవునూరు లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలోని సేల్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాం ను తనిఖీ చేయగా కోరమండల్ మన గ్రోమోర్ గోదాములో యూరియా స్టాక్ లేనట్లు గమనించి సదరు దుకాణంకు నోటీసులు జారీ చేయవలసిందిగా తెలిపారు. సదరు నోటీసులకు సరైన సంజాయిషీ సమర్పించి యూరియా స్టాక్ వెంటనే తెప్పించాలని ఆదేశించారు.నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందజేయాలని , కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానులను కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలి బేగం,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu