Telanganapatrika (June 6): CASTES AND TRIBES, రైతులు భూభారతి రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ రాగ్యా నాయక్ అన్నారు. రెవెన్యూ సదస్సులు గ్రామాల జూన్ ,6వ తేదీన శుక్రవారం నాడు అడవిదేవులపల్లి మండలంలోని కొత్త నందికొండ,మొల్కచర్ల, బంగారికుంట తండా, గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ రాగ్య నాయక్ మాట్లాడుతూ 9వ తేదీన బాల్నేపల్లి 10వ ముది మాణిక్యం, 11వ అడవిదేవులపల్లి,జిలకర కుంట తండా,గొనియా తండా,చాంప్లతండా, గ్రామాలలో భూ భారతి పై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు దీర్ఘకాలం నుంచి రైతులకు సంబంధించిన భూ సమస్యలు,రైతులకు భూమిపై హక్కులను,భద్రపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి పేరుతో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అన్నారు..

CASTES AND TRIBES
ఆధార్ కార్డ్,పాత పాస్ పుస్తకం, కొత్త పాస్ పుస్తకం, ఓ ఆర్ సి సర్టిఫికెట్, లావుని పట్టా సర్టిఫికెట్,రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్,సాదా బైనామా పత్రాలు,తహసిల్దార్ జారీ చేసిన ఉత్తర్వులు,కోర్టు ఉత్తర్వులు,13బి సర్టిఫికెట్,1బి పహాని పైన తెలిపిన పత్రములలో ఏవి ఉన్న దరఖాస్తుదారుడు జతపరచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ శ్రీనివాస్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, సిబ్బంది ఉన్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!