Joint Command Officer: మెటుపల్లి పట్టణానికి చెందిన ఆకుల లక్ష్మీ-నర్సయ్య దంపతుల పెద్ద కుమారుడు అయిన ఆకుల ఆనంద్ 2005 వ సంవత్సరంలో ఆర్మీలో చేరి గత 20 సంవత్సరాలలో అంబలా, ఢిల్లీ,జమ్మూకాశ్మీర్, ఝాన్సీ, హర్యానా, చండీగఢ్, లేహ్, లద్ధాక్, ఝాన్సీలో వివిధ హోదాలలో పనిచేసి ఈరోజు ఝాన్సీ ఆర్మీ కంటోన్మెంట్ జూనియర్ కమాండ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు కుటుంబసభ్యులు ఎంతో సంతోపడ్డారు. అంతేగాక మన ప్రాంత వాసి ఆర్మీలో ఉన్నత స్థానం పొందటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కష్టపడి ఈ స్థాయికి రావడం ఎంతో గొప్ప విషయమని ఇలాంటి వారిని చూసి స్థానిక యువకులు ఆదర్శంగా తీసుకుని దేశసేవకు ముందుకు రావాలని పలువురు పిలుపునిచ్చారు. Joint Command Officer ఇక వీరి కుటుంబ విషయానికి వస్తే తల్లిదండ్రులు ఆకుల లక్ష్మీ-నర్సయ్య మామూలు రైతులు నిరాక్షరాస్యులు అయినప్పటికీ వారి సంతానాన్ని ఎంతో కష్టపడి చదివించారు.వీరి కూతురు ఆకుల మంజుల గవర్నమెంట్ టీచర్ గా, పెద్ద కుమారుడు ఆనంద్ ఆర్మీ ఆఫీసర్,చిన్న కుమారుడు ఆకుల ప్రవీణ్ అడ్వకేట్ పనిచేస్తున్నారు.కష్టపడి పిల్లలను ఈ స్థాయికి తీసుకువచ్చిన వారి తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

Read More: Telangana revenue minister visit arrangements: కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను సమీక్షించారు