Akhilesh Yadav Ktr Meeting: హైదరాబాదులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో విభజన, ద్వేష రాజకీయాలకు ముగింపు కావాలని ఆయన స్పష్టం చేశారు.

నంది నగర్లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత టి.హరీష్ రావు కూడా పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీతో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, ప్రజల మద్దతే అసలైన బలం అని అన్నారు.
“దేశం ముందుకు సాగాలంటే సానుకూల రాజకీయాలు అవసరం. విభజన, నెగెటివిటీ రాజకీయాలు ముగియాలి” అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలసి ఆశీర్వాదం తీసుకుంటానని కూడా ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ సాధించిన విజయం ప్రశంసనీయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 37 ఎంపీ స్థానాలు గెలిచి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రజలతో బలమైన అనుబంధం ఉంటే రాజకీయాల్లో తిరిగి నిలదొక్కుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ భేటీ బీఆర్ఎస్–సమాజ్వాదీ పార్టీ మధ్య స్నేహబంధాన్ని మరింత బలపరుస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో కొత్త దిశకు ఇది సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
