తెలంగాణ పత్రిక (APR.16), AIRTEL: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 10 నిమిషాల్లో ఇంటి వద్దకే సిమ్ డెలివరీ చేసే సేవలు ప్రారంభించింది.

ఇందుకోసం క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ జతకట్టింది. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, హైదరబాద్ సహా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానునన్నట్లు ఎక్స్చేంజీ ఫైలింగ్ లో వెల్లడించింది.
ఈ డోర్ డెలివరీ సిమ్ కోసం కస్టమర్ రూ.49 చెల్లించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.
సిమ్ కార్డ్ ను తీసుకున్న కస్టమర్లు ఆధార్ కేవైసీ వెరిఫికేషన్ తో సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu