TELANGANAPATRIKA(JUNE12) : Ahmedabad Plane Crash 2025. గురువారం మధ్యాహ్నం AIR INDIA పేరుతో చరిత్రలోకి వెళ్లిపోయిన ఘోర విమాన ప్రమాదం అహ్మదాబాద్ ప్రజలను, దేశాన్నే షాక్కు గురిచేసింది. లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ 787 విమానం, మేఘనినగర్ సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 133 మంది మృతి చెందారని అధికారికంగా వెల్లడించారు.


DGCA ప్రకటన & అధికారుల స్పందన:
DGCA ప్రకారం, ఈ విమానం AI-171, బోయింగ్ 787 మోడల్కు చెందినది. కెప్టెన్ సుమిత్ సభర్వాల్కు 8,200 గంటల అనుభవం కాగా, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్కు 1,100 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియెన్స్ ఉంది.
సహాయానికి 011-24610843 మరియు 9650391859 నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
Ahmedabad Plane Crash 2025 ప్రధాని, హోంమంత్రి స్పందన:
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపత్తు బాధితులకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇద్దరు మంత్రులను ఘటనా స్థలానికి పంపాలని సూచించారు.
విమాన విపత్తుల చరిత్రలో మరో విషాదం:
ఈ ప్రమాదం 1987లో జరిగిన నోబుల్ నగర్ విమాన ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. అప్పట్లో 137 మంది మృతి చెందారు. ఇప్పుడు కూడా ఘోర ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu