TelanganaPatrika(jun 9): Aadi Srinivas,రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అర్హులైన 56 మంది లబ్ధిదారులకు రూ.18.37 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Aadi Srinivas పేదల వైద్య ఖర్చులకు అండగా సీఎం సహాయ నిధి
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
“పేద ప్రజల వైద్య చికిత్సలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప వరంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో మెడికల్ హబ్గా ఎదుగుతోంది,” అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం, ప్రభుత్వం చిత్తశుద్ధిని సూచిస్తుందన్నారు.
రూ.800 కోట్ల నిధుల పంపిణీ – ప్రజా ప్రభుత్వ గుర్తింపు
వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రూ.20 కోట్లకు పైగా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో రూ.400 కోట్లు మంజూరైతే, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటైన దగ్గరినుంచి ఇప్పటి వరకు రూ.800 కోట్లు పంపిణీ చేశామని వివరించారు.
ప్రజాప్రతినిధుల సందేశం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో శంకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని అభినందించారు.
Read Latest Telangana News in Telugu