హైదరాబాద్ లో తులానికి ₹1090 వరకు పెరిగిన బంగారం ధర. కిలో వెండి రూ.2000 పెరిగింది.

Gold Rates Today : పసిడి ప్రియులకు అలర్ట్. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం దేశీయంగా ప్రభావం చూపింది. వెండి రేటు కిలోకు ఏకంగా రూ.2000 మేర పెరిగింది.
హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా భారీగా పెరిగింది.
- 24 క్యారెట్ల మేలిమి గోల్డ్: తులానికి (10 గ్రాములు) ఏకంగా రూ.1090 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ. 1,22,570 స్థాయికి చేరుకుంది.
- 22 క్యారెట్ల బంగారం: తులానికి రూ.1000 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ. 1,12,350 వద్దకు చేరుకుంది.
రూ.2000 మేర పెరిగిన వెండి ధర Gold Rates Today In Hyderabad
హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి సైతం భారీగా పెరిగింది.
- కిలో వెండి రేటు: రూ.2000 మేర పెరిగింది. దీంతో కిలోకు ఇవాళ రూ. 1,65,000 స్థాయికి ఎగబాకింది.
గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు నవంబర్ 7, శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మధ్యాహ్నానికి మారుతుంటాయి. కొనుగులు చేసే ముందు స్థానిక మార్కెట్లో ధరలు తెలుసుకోవడం మంచిది.

One Comment on “Gold Rates Today In Hyderabad : బంగారం ధరల్లో ఊహించని మార్పు.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్”
Comments are closed.