Telanganapatrika (october 12):Telangana BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చకు దారి తీస్తోంది. ఇటీవల హైకోర్ట్ ఇచ్చిన GO 9, GO 41, GO 42 పై నిలిపివేత (stay order) కారణంగా ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్ట్కి వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించింది.

హైకోర్ట్ తన తీర్పులో “ట్రిపుల్ టెస్ట్” నిబంధనలను పాటించకపోవడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, న్యాయ నిపుణులతో చర్చించి, ఈ ఆదేశాలను సవాలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర న్యాయ విభాగం ఇప్పటికే పిటిషన్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, సుప్రీంకోర్ట్ ముందు రాబోయే వాదనల్లో BC రిజర్వేషన్లు సామాజిక సమతుల్యతకు అవసరం అనే వాదనను బలంగా వినిపించనుంది. రాబోయే విచారణ డిసెంబర్ ప్రారంభంలో జరగవచ్చని అంచనా.
Read More: Read Today’s E-paper News in Telugu
