Telanganapatrika : AP CM Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1992లో కేవలం ₹7,000 పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (Heritage Foods)స్థాపించారు. చిన్న వ్యాపారంలా మొదలైన ఈ డైరీ కంపెనీ, కొద్ది సంవత్సరాల్లోనే భారీగా ఎదిగింది.

AP CM Chandrababu Naidu హెరిటేజ్ ఫుడ్స్ రూ.7 వేల నుంచి వేల కోట్లు..
1994లో IPO ద్వారా ₹6.5 కోట్లు సమకూరగా, 1995 నాటికి మార్కెట్ విలువ ₹25 కోట్లుకి చేరింది. ఈ ప్రయాణం కొనసాగుతూ, 2025లో హెరిటేజ్ ఫుడ్స్ విలువ ₹4,500 కోట్లు దాటింది.
చంద్రబాబు మంత్రి అయిన తర్వాత, కంపెనీ బాధ్యతలు ఆయన భార్య నారా భువనేశ్వరికి అప్పగించారు. ప్రస్తుతం ఆమెకు కంపెనీలో 24.37% వాటా ఉండటంతో, హెరిటేజ్ విజయానికి ఆమెకూ కీలక పాత్ర ఉంది.
ఈ వాటా కారణంగా చంద్రబాబు దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు.
Read More: Read Today’s E-paper News in Telugu