Guru Purnima Celebrations 2025 – వేములవాడ సాయి ఆలయాలను సందర్శించిన ఆది శ్రీనివాస్.

Telanganapatrika (July 10): Guru Purnima Celebrations 2025,  వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్, తిప్పాపూర్, మరియు వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా సందర్శించారు.

Join WhatsApp Group Join Now

Guru Purnima Celebrations 2025
Guru Purnima Celebrations 2025

ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా స్వామికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “గురుపౌర్ణమి రోజు గురువులను పూజించి, వారి సేవను స్మరించుకుంటాం. వారు చూపిన మార్గంలో నడవడమే నిజమైన గౌరవం” అని పేర్కొన్నారు. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. అలాగే, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహించినందుకు ఆయన వారికి అభినందనలు తెలిపారు. చివరగా ప్రజలందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, “స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని” ఆయన ఆకాంక్షించారు.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *