TELANGANAPATRIKA (June 26): Fake journalist arrest Telangana. ఇచ్చోడా సీఐ బండారి రాజు వివరాల ప్రకారం, బాధితుడు అరుగుల సంతోష్ గత 20 సంవత్సరాలుగా తాటి కళ్లూ తీయడాన్ని జీవనోపాధిగా చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా భూమేష్ అనే వ్యక్తి తనను విలేకరిగా పరిచయం చేసుకొని పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

Fake journalist arrest Telangana “డబ్బులు ఇవ్వకపోతే జైలుకెళ్తావ్”
లేనిపక్షంలో “కల్తీ మద్యం అమ్ముతున్నావు” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. భయంతో బాధితుడు రూ.2000 ఇచ్చాడు. అనంతరం ఆయన గుడిహత్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి భూమేష్ను అదుపులోకి తీసుకున్నారు.
అటువంటి వారిపై కఠిన చర్యలు
ఇచ్చోడా సీఐ బండారి రాజు మాట్లాడుతూ — విలేకరి పేరుతో డబ్బులు డిమాండ్ చేసే నకిలీ పాత్రికేయులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజలు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీసుల హామీ
జిల్లా పోలీసులు ఎప్పుడూ ప్రజలకు సహాయంగా ఉంటారని, ఎలాంటి బెదిరింపులు వచ్చినా అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు భయపడకుండా ముందుకు రావాలని కోరారు.
Read More: Read Today’s E-paper News in Telugu