TELANGANAPATRIKA (June 17): Fake Land Documents in Telangana.ఆదిలాబాద్: కైలాస్ నగర్లోని సొసైటీ భూములను కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన ముఠాను ఆదిలాబాద్ పోలీసులు వెలికి తీసారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు షేక్ అర్బాజ్ను మంగళవారం దస్నాపూర్ వద్ద అరెస్ట్ చేసినట్టు జిల్లా డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.


Fake Land Documents in Telangana సొసైటీ భూములపై నకిలీ పత్రాల కుట్ర
1970లో ప్రభుత్వం కైలాస్ నగర్లో 20 ఎకరాలు నాన్-గెజిటెడ్ ఉద్యోగుల సొసైటీకి కేటాయించింది. ఇందులో 225 ప్లాట్లు సభ్యులకు ఇవ్వగా, 8 ప్లాట్లు పార్కులు, కమ్యూనిటీ ఉపయోగాలకే వదిలివేయబడ్డాయి. కానీ ఈ పార్క్ భూమిలోని నెంబర్ 4,5 ప్లాట్లను కబ్జా చేయాలని షేక్ అర్బాజ్ తన ముఠాతో కలిసి నకిలీ పత్రాలను తయారుచేశాడు.
రెజిస్ట్రేషన్లు – టాక్స్ చెల్లింపులు నకిలీ ఆధారంగా
2002లో ఎంఆర్ఓ పేరుతో నకిలీ కేటాయింపు పత్రాలు సృష్టించి, మున్సిపాలిటీలో హౌస్ నంబర్లు పొందాడు. తర్వాత పత్రాలను సయ్యద్ ఇమ్రాన్, షేక్ నూర్జహాన్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం సొసైటీ సభ్యుడు లోక ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదు చేయగా 2024లో కేసు నమోదైంది.
పోలీసులు హెచ్చరిక
ఇప్పటికే షేక్ అర్బాజ్పై పలు కేసులు ఉన్నాయి. అదే విధంగా మరో వ్యక్తి గొడ్డల శ్రీనివాస్పై కూడా నకిలీ పత్రాలతో భూమి ఆక్రమణ చేశాడని కేసు నమోదై రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. భూములపై హక్కులు పొందాలంటే సరైన లింక్ డాక్యుమెంట్లు ఉండాల్సిందేనని, నకిలీ పత్రాలతో చేసిన రిజిస్ట్రేషన్లకు హక్కులు లభించవని స్పష్టం చేశారు.
భూకబ్జా, నకిలీ పత్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Fake Land Documents in Telangana : నకిలీ పత్రాలతో భూమి కబ్జా ప్రయత్నం – షేక్ అర్బాజ్ అరెస్ట్”