Advertisement

Siddhu Jonnalagadda: జాక్ ఫెయిల్ కావడంతో రూ.4.75 కోట్లు తిరిగి ఇచ్చిన సిద్ధూ

తెలంగాణపత్రిక (June 5): Siddhu Jonnalagadda, ‘టిల్లూ’గా గుర్తింపు పొందిన సిద్ధూ జొన్నలగడ్డ తాజాగా జాక్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించాలనుకున్నా, బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. అంచనాలు ఉన్నా, కథనం, ప్రెజెంటేషన్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ.9 కోట్లు మాత్రమే రాబట్టింది. జాక్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందింది. అయితే హిట్ కాంబినేషన్ వర్కవుట్ కాకపోవడంతో నిర్మాతలకు నష్టం తప్పలేదు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda latest update new movie name

ఈ నేపథ్యంలో సిద్ధూ చేసిన ఒక మానవీయ నిర్ణయం సినీ పరిశ్రమలోని చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆయన తన పారితోషికంలో సగం అంటే దాదాపు రూ.4.75 కోట్లు నిర్మాతలకు తిరిగి చెల్లించారు. కమర్షియల్ పరాజయం కారణంగా వచ్చిన నష్టాన్ని కొంతవరకైనా తీయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది తన బాధ్యతగా భావించి ముందడుగు వేసిన తీరు పరిశ్రమలో అరుదైన ఉదాహరణగా నిలిచింది.

Advertisement

ఇకపోతే జాక్ తర్వాత సిద్ధూ ‘తెలుసు కదా’ అనే కొత్త రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం దర్శకురాలు నీరజా కోన తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 17, 2025న విడుదల కానున్న ఈ చిత్రం సిద్ధూకు మరో కొత్త అద్భుతం కావాలనే ఆశ cine circles లో నెలకొంది.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →