Telanganapatrika (June 4): Bhu Bharati Telangana, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం -2025ను అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు బుధవారం ఇల్లంతకుంట మండలంలో రెండు బృందాలు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాయి. తహసీల్దార్ ఫరూక్, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఆయా గ్రామాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు నిర్వహిస్తున్నారు.


ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసిన దరఖాస్తు ఫారాలను రైతులకు ఇస్తూ..సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. జవారిపేట గ్రామంలో 32 మంది రైతులు పలు సమస్యలపై దరఖాస్తులు ఇచ్చారు. తిప్పాపూర్ గ్రామంలో 26 మంది రైతులు .నుంచి దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని సిబ్బంది తెలిపారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!