
TELANGANA PATRIKA(JUN 4) , Karnataka liquor sales , IPL 2025 ఫైనల్లో RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) విజయం సాధించడంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

Karnataka liquor sales జోరుగా అమ్మకాలు ఫైనల్ రోజున
ఫైనల్ రోజు కర్ణాటక వ్యాప్తంగా మొత్తం ₹157.94 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంతో పాటు మైసూరు, వంటి ప్రధాన నగరాల్లో బీరు, హార్డ్ లిక్కర్ కు విపరీతమైన డిమాండ్ కనిపించింది
బీరు అమ్మకాల్లో విరివి:
- మొత్తం అమ్ముడుపోయిన బీరు బాక్సులు – 1.48 లక్షలు
- వీటి విలువ దాదాపు ₹30 కోట్లు
- మిగతా మద్యం అమ్మకాలు – ₹128 కోట్లు
క్రీడా వేడుకను తాగుబోతు సంబరంగా మార్చిన అభిమానుల వల్ల మద్యం దుకాణాలు హాట్కేకులయ్యాయి. శివారులోని కొన్ని ప్రాంతాల్లో బీరు తక్కవైపోయి, కస్టమర్లకు చేతికి తగినంత మద్యం లేకపోవడం కూడా కనిపించింది.
ప్రభుత్వానికి భారీ ఆదాయం
ఇవన్నీ లిక్కర్ అమ్మకాలపై ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో భాగంగా కర్ణాటక ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. ఒక్కరోజు నుంచే లక్షల రూపాయల లాభం ప్రభుత్వ ఖజానాకు జమైంది.
Read More: Read Today’s E-paper News in Telugu