
TELANGANA PATRIKA(JUN 4) , Peddapalli Doctor , మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తు మందు వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ మోహన్ రావు ట్యూబెక్టమీ ఆపరేషన్కు వచ్చిన ఓ మహిళ నుంచి లంచం డిమాండ్ చేసిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. రచ్చపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు కొడాలి భాగ్య నుండి రూ.5,000 లంచం అడిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Peddapalli Doctor డాక్టర్ మోహన్ రావు ను సస్పెండ్ చేసిన కలెక్టర్..
ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, బుధవారం డాక్టర్ మోహన్ రావును సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ వైద్యంలో అవినీతి అంతం చేయాలన్న సంకల్పం
కలెక్టర్ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే ఇలాంటి అవినీతిపరులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రోగులపై మానవత్వంతో వ్యవహరించాల్సిన వైద్యులు లంచం డిమాండ్ చేస్తే బరితెగిన అవినీతికి నిదర్శనమని అన్నారు.
ఈ చర్య ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న పోరాటానికి ఒక భాగంగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu