తెలంగాణ సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్ సమీక్ష సమావేశం…

TELANGANA PATRIKA (MAY24) , తెలంగాణ సచివాలయం : ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో పంచాయతీరాజ్‌, ఆర్‌&బీ శాఖల మౌలిక సదుపాయాల పనులకు అటవీ శాఖ అనుమతుల జాప్యం తలెత్తుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు శనివారం హైదరాబాద్ సచివాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Join WhatsApp Group Join Now

తెలంగాణ సచివాలయం లో మంత్రుల కలెక్టర్ ల భేటీ

ఈ భేటీలో అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అహ్మద్‌ నదీమ్‌, పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సువర్ణ, నిర్మల్‌ కలెక్టర్‌ అభిలష్‌ అభినవ్‌తో పాటు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, సీసీఎఫ్‌లు, డీఎఫ్ఓలు, ఐటిడిఏ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు పటేల్‌, కోవా లక్ష్మీ, పాల్వాయి హరీష్‌, అనిల్‌ జాదవ్‌, ఎంఎల్సీ దండే విఠల్‌లు మాట్లాడారు. అటవీ అనుమతులు ఆలస్యమవడం వల్ల అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. అధికారుల నివేదికలు, ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకున్న మంత్రులు, సమస్యను త్వరగా పరిష్కరించి అభివృద్ధి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాఖల మధ్య సమన్వయంతో పనుల వేగాన్ని పెంచాలని నిర్ణయించారు.

Also Read : Seethakka: మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)!

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →