
TELANGANA PATRIKA (MAY20) , నిజామాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, 21 మందిని పట్టుకున్నారు. ఈ కేసుల్లో ఐదుగురికి జైలు శిక్షలు విధించబడ్డాయి.
పోలీస్ స్టేషన్ వారీగా వివరాలు:
తేది 20.05.2025 న నిజామాబాద్ డివిజన్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా, నిర్ధారణ అయిన వారిని మార్నింగ్ కోర్ట్ (Special Judicial Second Class Magistrate ) నూర్జహాన్ బేగం ముందు హాజరుపరిచి శిక్షలు విధించారు.
నిజామాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో విధించబడిన శిక్షలు:
- 2 రోజులు జైలు శిక్ష: 4 మందికి
- 3 రోజులు జైలు శిక్ష: 1 మందికి
శిక్ష పొందిన వారు:
- బంటు చిన్న – దుర్గానగర్ తండా, Town-1 PS
- ఉల్లెంగాల సాయిలు – నాగారం, Town-5 PS
- భూమింగ్ అంకేష్ – ముల్లంగి, నవీపేట్ PS
- డబ్బాగుట్ట మలయాద్రి – దీకంపల్లీ, మాక్లూర్ PS
- మునిపల్లి సాయిలు – న్యాలకల్, ముగ్పాల్ PS (3 రోజులు జైలు శిక్ష)
అసిస్టెంట్ కమిషనర్ ఎల్. రాజ వెంకట్ రెడ్డి స్పష్టం:
“ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపరాదు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలి. మళ్లీ పట్టుబడితే మరింత కఠిన చర్యలు తీసుకోబడతాయి.”
జనాభాగస్వామ్యం అవసరం!
ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. మద్యం తాగి వాహనం నడపడం కేవలం చట్టవిరుద్ధమే కాక, ప్రాణాంతకమైంది కూడా.
Also Read : Drunk and Drive Counseling Telangana: వేములవాడలో వాహనదారులకు పోలీసుల అవగాహన కార్యక్రమం
One Comment on “నిజామాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు శిక్షలు 2025!”