వేములవాడ-ముంబై మధ్య ఏసీ బస్సు సేవల ప్రారంభం: మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ హాజరు..

VEMULAWADA 2 1024x538
Join WhatsApp Group Join Now
👇

TELANGANA PATRIKA (MAY 20) , వేములవాడ-ముంబై ప్రజల అభీష్టం మేరకు ముంబై కి లహరి స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మంగళవారం వేములవాడ చెరువు కట్ట గుడి ప్రాంగణం వద్ద వేములవాడ నుంచి ముంబై వరకు వెళ్లే రెండు ఏసీ బస్సులను రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. ప్రజల అభీష్టం మేరకు మే 20 నుంచి వేములవాడ నుండి ముంబై వెళ్ళెందుకు ఏసీ స్లిపర్ బస్సు లహరి సర్వీసులను ప్రారంభిస్తున్నామని అన్నారు. 2 లహరి సర్వీస్ ఏసీ బస్సులను ముంబై సర్వీస్ నిమిత్తం కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ నుండి బయలు దేరి తెల్లారి ఉదయం 4.45 గంటలకు ముంబై కు చేరుకుంటుందని, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని తెలిపారు. ప్రతిరోజు ముంబై నగరానికి అప్ అండ్ డౌన్ సర్వీస్ నడుస్తుందని అన్నారు.

వేములవాడ-ముంబై లహరి బస్సు సదుపాయాలు …

వేములవాడ-ముంబై లహరి బస్సు సర్వీస్ లో 22 సీట్స్, 20 స్లిపర్ బెర్త్ లు ఉన్నాయని, ప్రతి సీటుకు చార్జింగ్ పాయింట్, ఏసి అడ్జెస్ట్ మెంట్ సౌకర్యం ఉందని, వైఫై సౌకర్యం బస్సులో కల్పించామని, సిసి కేమేరాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వేములవాడ నుంచి ముంబైకు పెద్దలకు స్లీపర్ బెర్త్ కు 2 వేల రూపాయలు, సీటు 1500 రూపాయలకు, పిల్లలకు బెర్త్ 1600, సీట్ 1230 రూపాయలకు టికెట్ ఉంటుందని , పట్టణ వాసులు ఈ సర్వీసు ను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ముంబై లో ఉన్న తెలంగాణ బిడ్డల ప్రయాణంకి ఇబ్బంది కలగవద్దని అక్కడి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసుకున్నామనీ,ఈ బస్సు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారనీ రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం లో మహిళలకు మహా లక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం తో పాటు ఈపథకం విజయవంతం కావడానికి కష్టపడుతున్న ఆర్టీసీ డ్రైవర్ లు ,కండక్టర్ కు ,సిబ్బంది సంక్షేమానికి కట్టుబడుతూనే సంస్థ అభివృద్ధి దిశగా పని చేస్తున్నామని,ఆర్టీసీ లో కొత్త నియామకాలు ,కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

VMD TO MUMBAI 1024x538

వేములవాడ-ముంబై బస్సు ప్రారంభించిన అనంతరం ఆలయ ప్రాంగణం నుండి వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వరకు అదే బస్సులో ప్రయాణించీ ముంబై వెళ్ళే ప్రయాణికులకు, పట్టణ ప్రజలకు స్థానిక ప్రజలకు ముంబై లో ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి మహేష్ బి.గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ప్రజా ప్రతినిధులు , ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు డిపో మేనేజర్లు,ప్రజలు, ప్రయాణికులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా పౌర సంబంధాల అధికారి, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.

Also Read : మేడిపల్లి సత్యం: పేద కుటుంబాల ఆనందంగా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ….

Ee37138a4a686aefe905b83c243092ddc3001b69c2ab6f2bf9ed5c651ddd2e04

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

2 Comments on “వేములవాడ-ముంబై మధ్య ఏసీ బస్సు సేవల ప్రారంభం: మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ హాజరు..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *