TELANGANA PATRIKA (MAY 15) , Rajiv Yuva Vikasam Sircilla 2025 : దరఖాస్తులపై సమీక్ష సమావేశాన్ని మే 15న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ నిర్వహించారు. ఈ సమావేశంలో పథకం వివరాలు వెల్లడిస్తూ, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలంటూ అధికారులను ఆదేశించారు.


Rajiv Yuva Vikasam Sircilla 2025 దరఖాస్తుల గణాంకాలు:
- మొత్తం దరఖాస్తులు: 36,819
- బ్యాంకులకు పంపిన దరఖాస్తులు: 30,627
- తిరస్కరించబడిన దరఖాస్తులు: 6,192
- బ్యాంకుల ద్వారా బ్యాక్గ్రౌండ్ స్క్రూటినీ పూర్తి
దళారుల జోక్యం నివారణపై హెచ్చరిక
కలెక్టర్ స్పష్టంగా హెచ్చరిస్తూ, “దళారులు యూనిట్ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.
ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్య
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లాగానే, ఈ పథకంలోనూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిజంగా అర్హులైన పేదలకే అవకాశం ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. అనర్హుల ఎంపిక జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు:
- DRDO శేషాద్రి
- LDM మల్లికార్జున్
- మైనారిటీ వెల్ఫేర్ అధికారి భారతి
- బీసీ వెల్ఫేర్ అధికారి రాజ మనోహర్
- ఎం.పి.డి.ఓలు, ఇతర శాఖల అధికారులు
గమనించవలసిన ముఖ్యమైన తేదీ:
మే 20లోపల ఎంపీడీవోలు లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలకు సూచన:
యువ వికాసం పథకం కోసం డబ్బులు చెల్లించవద్దు. దళారులకు విరుద్ధంగా సమాచారం ఉన్నచో అధికారులకు తెలియజేయండి.
Also Read : Rajiv Yuva Vikasam 2025: రాజీవ్ యువ వికాసం – యువతకు స్వయం ఉపాధి అవకాశాలు