TELANGANA PATRIKA (MAY 10) , IPL Restart 2025: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో, ఒక వారం పాటు నిలిపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రారంభం కానుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో, బీసీసీఐ టోర్నీని కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.


IPL Restart 2025 DC vs PBKS మ్యాచ్ నుంచే
డీసీ vs పంజాబ్ (DC vs PBKS) మ్యాచ్ నుంచే టోర్నీ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ తాజా వివరాలు రేపు లేదా ఎల్లుండి అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం.
క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. మళ్లీ ఫ్యాన్స్ స్టేడియంలో సందడి చేసే రోజులు దగ్గరపడుతున్నాయి.
ఆధికారిక సమాచారం ప్రకారం, రేపు లేదా ఎల్లుండి కొత్త షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. టోర్నీ కొనసాగింపుతో పాటు భద్రతా చర్యలపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : PBKS VS DC: భద్రతా కారణాలతో IPL మ్యాచ్ రద్దు …!
2 Comments on “IPL Restart 2025: వారం లో ఐపీల్ ..!”