TGSRTC 2025: నర్సంపేట డిపోకు ప్రగతిచక్రం అవార్డు గౌరవం

TELANGANA PATRIKA (MAY 10) , TGSRTC 2025: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ రిజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాల్గవ త్రైమాసిక ప్రగతిచక్రం అవార్డుల కార్యక్రమం తొర్రూర్ డిపోలో ఘనంగా జరిగింది.

Join WhatsApp Group Join Now

ఈ కార్యక్రమంలో నర్సంపేట డిపో ఉద్యోగులు హరిసింగ్, ఎన్ ఎన్ రావు, ఎస్ ఎస్ పాణి, పి వి రావు, మహేష్ లు తమ అధిక ఇంధన పొదుపు, ఆధిక ఆదాయం సాధించడంలో అగ్రగామిగా నిలిచి అవార్డులకు ఎంపికయ్యారు.

TGSRTC 2025 ఉద్యోగుల కృషికి గుర్తింపు

ఉద్యోగుల కృషిని గుర్తించిన TGSRTC వరంగల్ రీజియన్ మేనేజర్ విజయభాను గారు మెమెంటోలు మరియు క్యాష్ అవార్డులను అందజేశారు. వారు తెలిపినట్లు, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచడం ద్వారా డిపో ప్రగతికి మద్దతు ఇచ్చిన వారు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

ప్రశంసించిన డిపో మేనేజర్

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి మాట్లాడుతూ, అవార్డులు అందుకున్న ఉద్యోగులను అభినందిస్తూ, మిగిలిన ఉద్యోగులు కూడా వీరి మార్గాన్ని అనుసరించాలని కోరారు. ఇది ఉద్యోగుల పట్టుదల మరియు కృషికి ప్రతిఫలంగా నిలుస్తుందని తెలిపారు.

పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ ఆర్ ఎం ఓ ఎం భానుకిరణ్, మహేష్ కుమార్, నర్సంపేట డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతోష్, ఎం ఎఫ్ ప్రభాకర్, సేఫ్టీ వార్డెన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Also Read : Telangana minor driving rules 2025 : మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా ?

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.