Telangana Gurukul Admissions 2026 : గురుకుల ప్రవేశాలకు భారీ స్పందన…

Telangana Gurukul Admissions 2026: తెలంగాణ గురుకుల విద్యాసంస్థలకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. 2026-27 విద్యాసంవత్సరానికి నిర్వహించిన మొదటి దశ అడ్మిషన్లలోనే 18,401 సీట్లు భర్తీ కావడం గురుకులాలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.

ఈ వివరాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సచివాలయంలో వెల్లడించారు. సైనిక్ స్కూల్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE), నాన్-సీఓఈ మరియు వొకేషనల్ జూనియర్ కళాశాలల ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు.

Advertisement

Telangana Gurukul Admissions 2026 45 వేలకుపైగా దరఖాస్తులు

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,357 దరఖాస్తులు అందాయి. అందులో:

MPC గ్రూప్‌కు – 21,447 దరఖాస్తులు
BiPC గ్రూప్‌కు – 17,400 దరఖాస్తులు
MEC, CEC, HEC గ్రూపులకు కలిపి – 6,510 దరఖాస్తులు అందినట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement

86 శాతం హాజరు

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉండగా, మే 15న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో 86.09 శాతం హాజరు నమోదైంది.

ఏ గ్రూపులో ఎన్ని సీట్లు భర్తీ?

మొదటి దశలో గ్రూపుల వారీగా సీట్ల భర్తీ ఇలా జరిగింది:

  • MPC – 8,440లో 8,156 సీట్లు
  • BiPC – 8,280లో 7,425 సీట్లు
  • MEC – 520లో 377 సీట్లు
  • CEC – 1,520లో 1,500 సీట్లు
  • HEC – 280లో 257 సీట్లు
  • వొకేషనల్ కోర్సులు – 700లో 686 సీట్లు

మొత్తం 1,339 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 7లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలి

అర్హత సాధించిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో జూన్ 7లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు.

జాతీయ స్థాయిలో గురుకుల విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. JEE Main-2026లో 337 మంది అర్హత సాధించారు. గత ఏడాది JEE Advancedలో 525 మంది ఎంపికయ్యారు.

గ్రామీణ, దళిత, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి IIT-JEE, NEET, NDA, CLAT వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో కార్పొరేట్ కళాశాలలకు పోటీగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు.

ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తూ తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →