CNG Price Hike: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు మరో రూ.2 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల్లో ఇది నాలుగోసారి ధరల పెంపు కావడం గమనార్హం.

మే మధ్య నుంచి ఇప్పటివరకు సీఎన్జీ ధరలు మొత్తం రూ.6 వరకు పెరిగాయి. మే 15న రూ.2, మే 18 మరియు మే 23న ఒక్కో రూపాయి చొప్పున పెంచిన తర్వాత తాజాగా మరో రూ.2 పెంచారు.
ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం పెట్రోల్పై లీటర్కు రూ.2.61, డీజిల్పై రూ.2.71 పెంచాయి. మే 15 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి దాదాపు రూ.7.5 వరకు పెరిగాయి.
CNG Price Hike రెండు వారాల్లో నాలుగోసారి షాక్
CNG Price Hike దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు రూ.102.12కు చేరుకోగా, డీజిల్ రూ.95.20కు పెరిగింది. ముంబై, కోల్కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, ఇరాన్-మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో సరఫరా అంతరాయం ఏర్పడటం వల్లే ఈ ధరల పెంపు జరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇక గృహ వినియోగ LPG సిలిండర్ ధరలు కూడా ఈ నెలలోనే రూ.60 వరకు పెరిగాయి. వరుస ధరల పెంపులతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో సాధారణ ప్రజలపై ద్రవ్యోల్బణ భారం మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
Read More: Read Today’s E-paper News in Telugu

