Women SHGs Telangana: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలను (SHGs) ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy ప్రకటించారు. మహిళా సంఘాలతో రైస్ మిల్లులు, లాజిస్టిక్ పార్కులు, కార్పొరేట్ తరహా సూపర్ బజార్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూములు కేటాయించి, బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తామని తెలిపారు.

Women SHGs Telangana ‘ఇందిరా గాంధీ స్త్రీ శక్తి’ భవనాల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 8,000 మహిళా సంఘ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రబీ సీజన్లో ప్రభుత్వం 8,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రవాణా, నిల్వలు, రైస్ మిల్లర్ల సమస్యలు ఎదురవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు స్వయంగా రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకుంటే రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
“అమెజాన్ లాంటి సంస్థలు భారీ గోదాములు నిర్మిస్తున్నాయి. మహిళలు ఎందుకు చేయలేరు? భూములు ఇవ్వడం నా బాధ్యత. మీరు లాజిస్టిక్ పార్కులు, రైస్ మిల్లులు నిర్మించండి” అని మహిళా సంఘ సభ్యులను ప్రోత్సహించారు.
మిల్లర్లు, మధ్యవర్తులు ప్రభుత్వాన్ని వేల కోట్ల రూపాయల మేర మోసం చేస్తున్నారని ఆరోపించిన సీఎం, ఈ బాధ్యత మహిళలకు అప్పగిస్తే ప్రతి గింజకు లెక్క చూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ధాన్యం నిల్వలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉండే గోదాముల్లోనే నిర్వహిస్తామని తెలిపారు.
Women SHGs Telangana మహిళా సంఘాలతో సూపర్ బజార్లు కూడా ఏర్పాటు సీఎం
అలాగే ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలు సుమారు రూ.10 వేల చొప్పున వాటా రూపంలో పెట్టుబడి పెడితే భారీ స్థాయిలో సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయవచ్చన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాల్లో తక్కువ అద్దెతో భూములు కేటాయిస్తామని చెప్పారు.
ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉన్న మహిళా సంఘాల బ్యాంక్ లింకేజీని రూ.10 లక్షలకు పెంచుతామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే SHG మహిళలకు రూ.60,472 కోట్ల మేర బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు.
జూన్ 5న మహిళా సంఘాల ఆధీనంలోని 553 బస్సులను హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఈ బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao పై పరోక్ష విమర్శలు చేసిన సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
