Telangana Inter Exam Rescheduled: బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఒక పరీక్షను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) వాయిదా వేసింది.

ముందుగా మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇప్పుడు మే 29కు మార్చినట్లు బోర్డు ప్రకటించింది. అయితే పరీక్ష సమయాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యథావిధిగా నిర్వహించబడుతుంది.
ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ మార్పు గురించి తప్పనిసరిగా తెలియజేయాలని జూనియర్ కాలేజీలను TGBIE ఆదేశించింది.
ఇక బక్రీద్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మే 28న అధికారిక సెలవు ప్రకటించింది. రాష్ట్ర క్యాలెండర్ ప్రకారం ముందుగా మే 27న సెలవు నిర్ణయించినప్పటికీ, ధుల్ హిజ్జా నెల చంద్ర దర్శనం ఆలస్యంగా కావడంతో పండుగ తేదీలో మార్పు వచ్చింది.
Telangana Inter Exam Rescheduled may 29
దీంతో మే 28న ఈద్-అల్-అధా (బక్రీద్) జరుపుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వం సెలవును కూడా మార్చింది. ఈ మార్పుతో విద్యార్థులు కొత్త పరీక్ష తేదీని గమనించాలని అధికారులు సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu

