Telangana Heatwave Warning : తెలంగాణలో మరింత పెరగనున్న ఎండలు వారం రోజులు జాగ్రత్త

Telangana Heatwave Warning: India Meteorological Department (IMD)తెలంగాణలో వచ్చే ఏడు రోజుల పాటు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగనున్నట్లు హెచ్చరిక జారీ చేసింది.

Telangana Heatwave Warning 45 డిగ్రీలు దాటే అవకాశం

వాతావరణ శాఖ అంచనా ప్రకారం మే 19 నుంచి మే 24 వరకు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45°C దాటే అవకాశం ఉంది.

Advertisement

హీట్‌వేవ్ ప్రభావం ఉండే జిల్లాలు

ఈ జిల్లాల్లో తీవ్ర ఎండలు ఉండే అవకాశముందని IMD తెలిపింది. ఆదిలాబాద్ , కుమురం భీమ్ ఆసిఫాబాద్ , మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇప్పటికే నమోదైన భారీ ఉష్ణోగ్రతలు.

Telangana Development Planning Society వివరాల ప్రకారం:

  • నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో 45.7°C
  • మోస్రా మండలంలో 45.5°C
  • నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 45.3°C నమోదైంది.

హైదరాబాద్‌లో పరిస్థితి

Greater Hyderabad Municipal Corporation పరిధిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 40.4°Cగా నమోదైంది. గోషామహల్ ప్రాంతంలో అత్యధికంగా 42.3°C నమోదైంది.

Advertisement
ప్రభుత్వ అప్రమత్తం

హీట్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పడకలు, IV ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు, ORS ప్యాకెట్లు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచింది.

Telangana Heatwave Warning ప్రజలకు సూచనలు

అధికారులు ప్రజలకు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలి,ఎక్కువగా నీరు తాగాలి, తేలికపాటి దుస్తులు ధరించాలి, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.

తెలంగాణలో వచ్చే వారం పాటు తీవ్ర ఎండలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం కూడా వైద్య సదుపాయాలను సిద్ధం చేసింది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →