తెలంగాణ పత్రిక (APR.16) , RAJIV YUVA VIKASA 2025: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం విషయమై కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ పథకం దరఖాస్తు ఏప్రిల్ 24వ తేదీ వరకు గడువును పొడిగించింది.
బ్యాంకర్లు ముందుకు వస్తే యువత ఆర్థికంగా ఎదుగుతారని, రూ.6వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది.
Read More: Read Today’s E-paper News in Telugu