తెలంగాణ పత్రిక (APR.13) : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకలతో పాటు వివిధ గ్రామాల్లో పర్యటనలు, విగ్రహావిష్కరణలు మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు వివరాల్లోకి వెళితే.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తి పర్యటన వివరాలు (ఏప్రిల్ 14, 2025)
ఉదయం 09:10 నిమిషాలకు వేములవాడ పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు
ఉదయం 10:00 గంటలకు సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు
మధ్యాహ్నం 12:30 నిమిషాలకు వేములవాడ అర్బన్ మండలం కోడుముంజ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు
మధ్యాహ్నం 02:15 నిమిషాలకు కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలోని హనుమాన్ తండాలో హనుమాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు
మధ్యాహ్నం 03:00 గంటలకు చందుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారు
మధ్యాహ్నం 03:45 నిమిషాలకు కథలాపూర్ మండల కేంద్రంలో వివాహ వేడుకల్లో పాల్గొంటారు
సాయంత్రం 04:30 నిమిషాలకు రుద్రంగి మండల కేంద్రంలో వివాహ వేడుకల్లో పాల్గొంటారు
సాయంత్రం 05:00 గంటలకు రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టం అమలు కార్యక్రమంలో పాల్గొంటారు