తెలంగాణ పత్రిక (APR.13) : Vemulawada News 2025. వేములవాడ పట్టణంలో ఏప్రిల్ 13న చోటుచేసుకున్న ఒక సంఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనకు కారణమైంది. బింగి మహేష్ ఫంక్షన్ హాల్ వద్ద శెట్టిపల్లి పర్శరాం అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృ*తిచెందాడు. ఈ సంఘటనకు బైరెడ్డి అనే వ్యక్తి మరియు అతని ఇద్దరు సహచరులు సంబంధమున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.


ఈ సంఘటనపై బైరెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసి, తాను ఈ ఘట్టానికి సంబంధించిన విషయాలను వెల్లడించాడని తెలుస్తోంది. సంఘటనకు పాత వ్యక్తిగత వివాదాలే కారణమన్న ప్రాథమిక సమాచారం అందుతోంది.
పోలీసులు మృ*తదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Read More: AADI SRINIVAS: పేదవారికి కడుపునిండా సన్న బియ్యంతో భోజనం.
One Comment on “Vemulawada News 2025: వేములవాడలో కలకలం: పాత గొడవ నేపథ్యంలో వ్యక్తి మృ*తి”